ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి.. ఎం ధర్మారావు..
Thovva web news.//04 feb.sun

ప్రజాసమస్యలపై స్పదిస్తూ ప్రజల అవసరాలను తీర్చుతాడనే నమ్మకం కలిగి నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడితేనే నాయకుడు అవుతాడని బిజెపి రాష్ట్ర నాయకులు మాజీ శాసనసభ్యులు ధర్మారావు అన్నారు. ఆదివారం మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నూతన జిల్లా బిజెపి అధ్యక్షుడిగా ప్రకటించిన యలమంచలి వెంకటేశ్వర్ రావు బాద్యతలు స్వీకరించారు. మాజీ జిల్లా అధ్యక్షుడు వద్దిరాజు రాంచంద్రయ్య అయన కు జిల్లా పార్టీ పగ్గాలు అందించారు. ఈసందర్బంగా కార్యకర్తలు ముఖ్యనాయకులు సమావేశంలో ముఖ్య అతిదిగా రాష్ర్ట నాయకులు రాజవర్దన్ రెడ్డి హాజరై మాట్లాడుతూ, పని చేసే వారికి పార్టీలో గుర్తింపు ఉంటుందని , కొత్త పాత అనే తేడా లేకుండా అందరిని కలుపు కొని పోవాలని సూచించారు. రాబోయే ఎంపి ఎన్నికలలో కార్యకర్తల బూత్ స్తాయిలో ప్రజా సమస్యలపై పార్టీ విస్తరణ దృష్టి పెట్టాలని తెలిపారు . ఈ సందర్బంగా నూతన అద్యక్షుడికి శాలువాలతో ఘన స్వాగతం పలికి శుబాకాంక్షలు తెలిపారు . ఈ కార్యక్రమంలో మాజి అద్యక్షుడు యాప సీతయ్య, ఇతర మండల అద్యక్షులు , నాయకులు వెంకటరెడ్డి, సురేందర్రెడ్డి , రాజేష్ , తదితరులు పాల్గొన్నారు
