ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర నాయకులు కర్నవాత్ వెంకన్న నాయక్

తొవ్వ, నెల్లికుదురు, సెప్టెంబర్ 24
ఈనెల 28న జిల్లా కేంద్రమైన మహబూబాబాద్ లో జరుప తలపెట్టిన లంబాడీల ఆత్మగౌరవ ర్యాలీ సభను జయప్రదం చేయాలని ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర నాయకులు కార్నవత్ వెంకన్న నాయక్ లంబాడీలకు పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలోని స్థానిక విశ్రాంతి భవనంలో ఎల్ హెచ్ పి ఎస్ మండల అధ్యక్షులు జాటోత్ వీరన్న నాయక్ ఆధ్వర్యంలో లంబాడీల ఆత్మగౌరవ ర్యాలీ సభ కరపత్రం ను ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర నాయకులు బోడా లక్ష్మణ్ , స్థానిక నేతలతో కలిసి విశ్రాంతి భవనంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లంబాడీలం వలసవాదులం కాదని మేమే మూలవాసులమని ప్రభుత్వం తెలుసుకోవాలని కోరారు. లంబాడి కుల వ్యతిరేక శక్తులు స్వార్ధ రాజకీయాల కోసం వ్యక్తిగత స్వార్థం కోసం అన్నదమ్ములుగా కలిసి ఉన్న గిరిజన తెగల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు. లంబాడీల పై జరుగుతున్న దృశప్రచారాన్ని త్రిప్పికొట్టి వాస్తవ పరిస్థితులను యావత్ సమాజానికి తెలియజేసేందుకుగాను లంబాడీల ఆత్మగౌరవ ర్యాలీ సభను నిర్వహిస్తున్నామన్నారు. అందుకుగాను మండలం నుంచి 5000 మంది లంబాడీలు తరలిరావాలని కోరారు. పార్టీలకతీతంగా లంబాడీలంతా ఐక్యంగా విచ్చేసి సభను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా నాయకులు గుగులోతు నారాయణ నాయక్, గుగులోతు శంకర్ నాయక్, మాన్సింగ్, హనుమంతు, ప్రకాష్ , కళ్యాణ్ నాయక్, అచ్చు నాయక్, రాజు నాయక్, తదితరులు ఉన్నారు.తొవ్వ, నెల్లికుదురు, సెప్టెంబర్ 24
ఈనెల 28న జిల్లా కేంద్రమైన మహబూబాబాద్ లో జరుప తలపెట్టిన లంబాడీల ఆత్మగౌరవ ర్యాలీ సభను జయప్రదం చేయాలని ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర నాయకులు కార్నవత్ వెంకన్న నాయక్ లంబాడీలకు పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలోని స్థానిక విశ్రాంతి భవనంలో ఎల్ హెచ్ పి ఎస్ మండల అధ్యక్షులు జాటోత్ వీరన్న నాయక్ ఆధ్వర్యంలో లంబాడీల ఆత్మగౌరవ ర్యాలీ సభ కరపత్రం ను ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర నాయకులు బోడా లక్ష్మణ్ , స్థానిక నేతలతో కలిసి విశ్రాంతి భవనంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లంబాడీలం వలసవాదులం కాదని మేమే మూలవాసులమని ప్రభుత్వం తెలుసుకోవాలని కోరారు. లంబాడి కుల వ్యతిరేక శక్తులు స్వార్ధ రాజకీయాల కోసం వ్యక్తిగత స్వార్థం కోసం అన్నదమ్ములుగా కలిసి ఉన్న గిరిజన తెగల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు. లంబాడీల పై జరుగుతున్న దృశప్రచారాన్ని త్రిప్పికొట్టి వాస్తవ పరిస్థితులను యావత్ సమాజానికి తెలియజేసేందుకుగాను లంబాడీల ఆత్మగౌరవ ర్యాలీ సభను నిర్వహిస్తున్నామన్నారు. అందుకుగాను మండలం నుంచి 5000 మంది లంబాడీలు తరలిరావాలని కోరారు. పార్టీలకతీతంగా లంబాడీలంతా ఐక్యంగా విచ్చేసి సభను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా నాయకులు గుగులోతు నారాయణ నాయక్, గుగులోతు శంకర్ నాయక్, మాన్సింగ్, హనుమంతు, ప్రకాష్ , కళ్యాణ్ నాయక్, అచ్చు నాయక్, రాజు నాయక్, తదితరులు ఉన్నారు.