
•విచారణ చేపడుతున్న పోలీసులు..
తొవ్వ, కేసముద్రం, జూలై 23: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో గొర్రెల కాపరి దారుణ హత్యకు గురయ్యారు. స్థానికుల కథనం ప్రకారం కంకాల ఉప్పలయ్య బుధవారం గొర్లను కాయడానికి వెళ్లిన నేపథ్యంలో గుర్తుతెలియని దుండగులు దాడి చేసి నరికి హత్య చేశారని, విషయాన్ని తెలుసుకున్న డిఎస్పీ తిరుపతిరావు, సీఐ సర్వయ్య, ఎస్సై కరుణాకర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
