పాప ప్రజ్ఞ ఆత్మ నన్ను వెంటాడుతుంది…

 ‘మృతదేహాలను నేనే ఖననం చేశా….

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

నేత్రవతి నది వరద ఉధృతికి కొన్ని కొట్టుకొని పోయాయేమో…

భీమా ఖననం చేయడం తెలుసు…

ధర్మస్థల చుట్టుపక్కల ప్రాంతాల్లో భీమ మృతదేహాలను ఖననం చేయడాన్ని తాము చూశామని కొత్తగా ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) ముందుకు వచ్చిన సాక్షులు తుకారామ గౌడ, పాండురంగ తెలిపారు. భీమ కొన్ని చోట్ల మృతదేహాలను తీసుకువెళ్లి పూడ్చడాన్ని 2009లో చూశామని, మరికొన్నింటికి తాము సహాయంగా వెళ్లామని చెప్పారు. ఆ రోజు మేము చూసిన భీమకు- ఇప్పుడు మాస్కు వేసుకుని వెళ్లిన వ్యక్తికి పొంతనే కనిపించడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాలను పూడ్చిన ప్రదేశాన్ని చూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. నేత్రావతి నదీ తీరంలో ఒక మృతదేహాన్ని ఖననం చేయడం వెనుక స్థానిక పోలీసు అధికారి ఒకరు ఉన్నారని మరో స్థానికుడు పురందర గౌడ ఆరోపించారు. ఈ పాతికేళ్లలో నేత్రావతి తీరంలో జరిగిన అభివృద్ధి పనులతోనే మృతదేహాలను ఖననం చేసిన ప్రాంతాన్ని కచ్చితంగా గుర్తించడంలో జాప్యం జరుగుతుందని పేర్కొన్నాడు. ఒక రోజు సాయంత్రం 5 గంటల సమయంలో కారు డిక్కీ నుంచి మృతదేహాన్ని దించి, అప్పటికే తీసిన గుంతలో ఖననం చేయడం చూశానని చెప్పాడు. ఘటన జరిగి పదహారేళ్లయిన అనంతరం ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేయడంతో ధైర్యంగా ముందుకు వచ్చానని ఆయన తెలిపారు.

ఎక్కడికి పోలేదు

మంగళూరు, న్యూస్‌టుడే : తాను పరారయ్యానని కొందరు తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని- ధర్మస్థలలో కనిపించకుండా పోయిన వైద్య విద్యార్థిని అనన్యభట్ తల్లి సుజాతా భట్ ఖండించారు. తన కుమార్తె 2003లో ధర్మస్థలకు వెళ్లి అనుమానాస్పదంగా కనిపించకుండా పోయిందని, ఆమె హత్యకు గురైందన్న అనుమానాన్ని ఇప్పటికే సుజాత వ్యక్తం చేశారు. తన కుమార్తె అస్థిపంజరాన్ని ఇప్పిస్తే విధివిధానాలను పూర్తి చేసుకుంటానని ధర్మస్థల, బెళ్తంగడి ఠాణాలో ఆమె ఫిర్యాదు చేశారు. ఇప్పుడు తాను కనిపించకుండా పోయానని కొందరు ప్రచారం చేయడంతో సెల్ఫీ వీడియో విడుదల చేసి, తాను సురక్షితంగా, క్షేమంగా ఉన్నానని, ఎక్కడకూ పరారు కాలేదని స్పష్టం చేశారు.

’ధర్మస్థలకు చెడ్డపేరు తేకండి

  ధర్మస్థలకు చెడ్డపేరు తీసుకువచ్చేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిని తుపాకీతో కాల్చి చంపాలని మాజీ మంత్రి ఎంపీ రేణుకాచార్య డిమాండ్‌ చేశారు. వందలాది మృతదేహాలను పూడ్చి పెట్టానని ముసుగు వ్యక్తి 16 ప్రాంతాలను చూపించగా, ఒకచోట మినహా మిగతా ఎక్కడా అస్థిపంజరాలు లభించలేదని గుర్తు చేశారు. ఒకప్పుడు చిన్న గ్రామంగా ఉన్న ధర్మస్థల, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు, తమవారు మరణిస్తే వాటిని అటవీ విభాగంలోనే ఖననం చేసేవారని గుర్తు చేసుకున్నారు. హిందువుల ఆలయాలు, సంస్థలకు చెడ్డపేరు తీసుకువచ్చేందుకు తెరవెనుక ఉన్న వారెవరో స్థానికులు ఇప్పటికే గుర్తించారని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *